కఠో పనిషత్ వ్రాసి కొన్ని వేల సంవత్సరాలయింది. అందుకని దీనిలోని ఘటనలన్నీ సంవత్సరాల క్రిందటి సాంఘిక పరిస్థుతులలో జరిగిన సంఘటనలుగా గుర్తించాలి.
అప్పుడు ఉన్న నమ్మకాలలో, మానవులు మరణానంతరం వారివారి పాప పుణ్యాల ఫలితంగా నరకంలోనో స్వర్గంలోనో కొంతకాలం గడిపి మరల భూమి మీద పునర్జర్మి స్తారని నమ్మకం ఒకటి. యజ్ఞ యాగాదులు దాన ధర్మాలూ చేస్తే పుణ్య మోస్తుందనీ చంపటాలూ దోపిడీలు చేస్తే పాపం వస్తుందనీ నమ్మకాలు. స్వర్గంలో ఎక్కువ రోజులు గడపటానికి ఆ కాలంలో దేవుళ్ళకి యజ్ఞాలు చేసి పుణ్యం సంపాయించటానికి ప్రయత్నించే వాళ్ళు. పాప భయంతో దోపిడీలుగట్రా ఎక్కువగా ఉండేవి కాదు. ఎంత పుణ్యం కూర్చుకుంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చు. హిందూ మతంలోనే కాదు దాదాపు అన్ని మతాల్లోనూ ఈ స్వర్గ (Heaven ) ప్రస్తావన ఉంది.
పదకొండేళ్ళ "నచికేతుడు" తండ్రిచేస్తున్న "విశ్వజిత్ " యజ్ఞం ఆసక్తితో గమనిస్తున్నాడు. యజ్ఞంలో చివరికి దానాల దగ్గరకివచ్చేసరికి నచికేతుడికి తండ్రి చేస్తున్న పని నచ్చలేదు. పుణ్యం రావాలంటే ఈ యజ్ఞంలో తనకున్న వస్తువులన్నీ దానం చేసెయ్యాలి. మంచి ఆవుల్ని తాను ఉంచుకుని, పనికిరాని వట్టిబోయిన ముసలి ఆవుల్ని తన తండ్రి ఎందుకు దానంగా ఇస్తున్నాడో అర్ధం కాలేదు. ఇలా చేస్తే యజ్ఞ కర్త కి కావలసిన ఫలితం రాకపోవచ్చు. తండ్రికి యజ్ఞ ఫలితం తప్పకుండా రావాలి. తాను కూడా తండ్రికి కావాల్సిన వస్తువేగా తనని దానం చెయ్యమని వెళ్ళి తండ్రిని అడుగుతాడు. తండ్రి సమా ధానంచెప్పలేదు అయినా ఆగకుండా మరల మరల "నాన్నా నన్ను ఎవరికి దానం చేస్తావు ? అని తండ్రిని ప్రశ్నిస్తాడు. తండ్రి చివరికి విసిగి కోపం మీదున్నాడో ఏమో "యముడికి (God of death )" అని సమాధానం ఇస్తాడు.
తన తండ్రికి ఎల్లాగయినా యజ్ఞ ఫలితం రావాలి అని తానే ముందరగా యముడిని చూడటానికి వెళ్తాడు. సింహద్వారం దగ్గర భటులు ప్రస్తుతం "యముడు" బయటకి వెళ్ళారు అని చెబితే, వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అని సింహద్వారం దగ్గరే నచికేతుడు కాచుకు కూర్చుంటాడు. "యముడు" తిరిగివచ్చే సరికీ, నచికేతుడు తిండీ తిప్పలూ లేకుండా మూడు రోజులు మూడు రాత్రులు గడపాల్సొస్తుంది.
ఏమీ తీసుకోకుండా మూడు రోజులు గడిపిన నచికేతుడి సంగతి తెలిసి, అప్పుడే తిరిగివచ్చిన యముడు చాలా బాధపడతాడు. తాను ఇంటిలో లేక పోవటాన నచికేతుడికి తగిన మర్యాదలు చేయలేకపోయానని చెప్పి ఆతిధ్య లోపం ఉన్న ఆ మూడు రోజులకీ మూడు వరాలు ఇస్తాను కోరుకోమంటాడు.
తాను తిరిగి వెళ్ళినప్పుడు తన తండ్రి కి తన మీద కోపం ఉండకుండా చూడమని మొదటి వరంగా కోరుకుంటాడు నచికేతుడు. యముడు వెంటనే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అంటాడు.
మనుషుల్ని స్వర్గానికి చేర్చే యజ్ఞాల గురించి రెండవ వరంగా చెప్పమంటాడు. దానికి యముడు ఆ రహస్యాలన్నీ చెప్పటమే కాకుండా అవి నచికేతుడి యజ్ఞాలుగా వాడుకలో ప్రసిద్ధి చెందుతాయని చెబుతాడు. దానికితోడు "మంచిబాలుడు" నచికేతుడికి అందమయిన కంఠహారంగూడా కానుకగా ఇస్తాడు.
మూడవ కోరికకి వచ్చే సరికి నచికేతుడు "ప్రభూ మనుషులు తనువు చాలించిన తరువాత కొందరు ఆ మనిషి చనిపోయాడంటారు కొందరు చనిపోలేదంటారు " దీనిలో ఏది నిజమో వివరించి చెప్పమంటాడు.
యముడు (Lord of Death ) చాలా ఇరకాటంలో పడతాడు. తన ఈ రహస్యాలు (Job Secrets) ఎవ్వరికీ చెప్పకూడదు ఇంకేమన్నా అడుగు వజ్రవైఢూర్యాలూ రాజభోగాలూ అప్సరసలూ స్వర్గ సౌకర్యాలూ ఏమైనా అడుగు ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు దేనికీ వప్పుకోడు తాను అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలని పట్టుబడతాడు.
నచికేతుడి ఈ కోరిక నుండి తప్పించలేక యముడు దానికి సమాధానం ఇస్తాడు. ఈ ఉపనిషత్ లో ఎక్కువ భాగం నచికేతుడి సంశయానికి యముడి వివరణే. తర్వాతి పోస్టులో దీనిని గురించి వివరంగా వ్రాస్తాను.
నా మాట:
దీని back drop వేల ఏళ్ళ క్రిందట గుళ్ళు గోపురాలు లేని రోజుల్లో ఉన్న ఆచారాలు. స్వర్గానికి పోవాలని ప్రతీవాడికీ కోరిక.
వేల ఏళ్ళ క్రిందట కూడా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించటం ఆచారంగా ఉండేది. పొరపాటున ఏమన్నా పొరపాటు జరిగితే క్షమించ మనటం కూడా ఆచారమే. ఇప్పటికీ ఇళ్ళల్లో ఈ ఆచారం ఉంది. ఆచారాల్ని ఎవరూ పనిగట్టుకుని చెప్పరు. ఇవన్నీ వారివారి ఇళ్ళల్లో వాడుకని బట్టి గ్రహించేవే.
హిందువులు ఆచరించే అన్ని ఆచారాలలోనూ (యజ్ఞాలూ, యాగాలూ, నోములూ, పండగలూ వగైరా) చివరిలో దాన ప్రక్రియ ఉంటుంది (తనకున్న వాటిని పంచుతారు). ఒక విధంగా ఇది Distribution of Wealth (ఉన్న వాళ్ళు లేనివాళ్ళకి పంచటం) క్రిందికి వస్తుంది. ఇటువంటి దాతృత్వాన్ని సంఘంలో ఒక మంచి ఆచారంగా మార్చారు.
నచికేతుడి యమలోక యాత్రని మీరు realistic గ చూడలేకపోతే అది ఒక పెద్ద నచికేతుడి కల అనుకోండి. యమలోకంలో యముడికి నచికేతుడికి జరిగిన సంభాషణలు చాలా realistic గ ఉంటాయి. ఇక్కడే నాకు సంస్కృతం నేర్చుకుంటే ఎంత బాగుండేదో అనిపించేది.
నా ఈ పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda, and Lectures of Swami Tejomayaananda and Swami Sarvapriyananda.