Monday, July 19, 2021

171 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 2 (Ishopanishad)

వేదములు నాలుగు. ఋగ్వేదము సామ వేదము యజుర్వేదము అధర్వణ వేదము. వాటిలో  యజుర్వేదములు రెండు, శుక్ల యజుర్వేదము, క్రిష్ణ యజుర్వేదము. అన్నిటిలోనూ ఉన్నవి సంస్కృత శ్లోకములు. వీటినే మంత్రాలు అని అంటారు.

ఒక్కొక్క వేదము నాలుగు భాగాలుగ విభజించబడినది. మంత్రం, బ్రాహ్మణీకం, ఆరణ్యకం, ఉపనిషత్. ఈ నాలుగు వరుసగా జీవితంలో ఆచరించవలసిన బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు సంబంధించినవి. ఉపనిషత్ ని వేదాంతం అని కూడా అంటారు (వేదముల చివర). అన్నివేదములలోనూ మంత్ర భాగంలో మొదటి మంత్రం శాంతి మంత్రం. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈ శుక్ల యజుర్వేదంలో మాత్రం ఉపనిషత్ మంత్ర భాగంలో ఉన్నది. ఈ మంత్రాలన్నీ చక్కటి సంస్కృత సమాసాలతో పొందుపరిచిన భావాలతో గుబాళిస్తూ ఉంటాయి.  

క్రిందటి పోస్టులో శుక్ల యజుర్వేదములో శాంతి మంత్రము గురించి తెలుసుకున్నాము. ఈ పోస్టులో  ఈ ఉపనిషత్ లోని ముఖ్యమయిన మొదటి మంత్రం గురించి తెలుసుకుందాము. 

మొదటి శ్లోకం :

ఓం  ఈశా  వాస్య  మిదగం సర్వం 

యత్కించ  జగత్యామ్  జగతు 

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)

మాగృతః  కస్య  సిద్దనం 

మన జీవితంలో మనం ఎక్కువగా ప్రేమించేది మనల్నే. ఆ తరువాతే ఎవ్వరినైనా. మన శరీరం మీద గాయమయితే వచ్చే (ఇతరులు చీదరించుకునే) చీము నెత్తురికి కూడా ప్రేమగా జాగర్తతో కట్లు కడతాము, మన ప్రేమలూ పెళ్ళిళ్ళూ, బాధలూ భయాలూ ,సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇతరులకి చెప్పుకుంటూ ఉంటాము. అంతా నేను నేను నేను.

మనని మనం పరిశీలించుకుంటే --- మనం మన పంచేంద్రియా లకి కట్టుబడి ఉన్నామని  తెలుస్తుంది. చాలావరకు వాటి సలహాలు/ఆజ్ఞలను మనం శిరసావహిస్తాము. వాటిల్లో మనకి బాధపెట్టేవి, మనము ఏమీ చెయ్యలేనివీ, ఎక్కువగా ఉంటాయి. వాడికి మనకన్నా ఎక్కువ డబ్బులున్నవనో, డబ్బులున్నవాడు పిసినిగొట్టు అనో, వాడి ఇల్లు పెద్దదనో, మన కారు వాడి కారు కంటే మరీ చిన్నదనో, పెళ్ళాం పిల్లలు తన మాట వినటల్లేదనో, బాస్ ఎక్కువ పని చేయిస్తున్నాడనో, తన కింద పనిచేసే వాళ్ళు సరీగ్గా పనిచెయ్యటల్లేదనో, ఏవో భావాలు ఎప్పుడూ మనస్సులో మెదులుతూ మనని కెలుకుతూ ఉంటాయి. 

దీనికి కారణం తాను దోష శూన్య మైన వాడిననీ (perfect ) మిగతావాళ్ళు కాదనీ (imperfect ) అని చెప్పవచ్చు. మన మనుకుంటున్న Imperfect వాళ్ళు గనక Perfect గ మారితే మన సమస్యలన్నీ పోతాయి. కానీ ఏది తేలిక? మన చుట్టూతా ఉన్న మనమనుకుంటున్న imperfect వాళ్ళని మార్చటమా లేక మనం ఒక్కళ్ళమే మారటమా?  మీ సమస్యలన్నీసరి అవ్వాలంటే ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి.  

"అందరినీ సృష్టించింది నేనే. అన్నిటి లోనూ ఉన్నది నేనే. నీలో ఉన్న భగవదంశని గుర్తిస్తే  అందరిలోనూ నన్ను చూడగలవు. ఇంకొకళ్ళ సంపద మీద కోరిక పెట్టుకోకుండా, ఉన్న దానితో జీవితం ఆనందంగా గడుపుతావు."

చిన్న చిన్న లొసుగులు అందరిలోనూ ఉంటాయి. ఎన్ని లొసుగులున్నా నిన్ను నీవు ప్రేమించుట లేదా అటులనే అందరూ నీలాంటి వారే అనుకో. 

మనం ఉంటున్న ఈ జగత్ ఎప్పుడూ ఒక చోట ఉండదు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సృష్టి ఎప్పుడూ ముందుకి జరిగి పోతూనే ఉంటుంది. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ జీవించకు, ఆ క్షణం తిరిగిరాదు. 

(దోష నిర్ధారణ నేను చూసుకుంటాను. ప్రాణం ఇచ్చేది తీసేది నేనే. నీ పద్దతి మార్చుకో. )"

ఇదే క్లుప్తంగా ఈ శ్లోక తాత్పర్యం.

యత్కించ  జగత్యామ్  జగతు  : నీతోపాటు ముందుకి సాగిపోతున్నఈ  జగత్ సృష్టిలో  నేనున్నాను. నేనేకదా వాటిని సృష్టించింది !.

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  : "ఓం" అంటూ ప్రార్థిస్తూ  (meditate)  నీలో ఉన్న నన్ను గుర్తిస్తే  నీ చుట్టుపక్కల వారిలో గూడా నన్ను గుర్తిస్తావు. 

మాగృతః  కస్య  సిద్దనం : ఇంకొకళ్ళ సంపద  మీద కోరిక  పెట్టుకోకు.

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా) : నన్ను అందరిలోనూ  గుర్తించి నీ పాత ధృక్పధాన్ని మార్చుకుని ఇంకొకళ్ళ సంపద మీద కోరిక పెట్టుకోకుండా నీ జీవితం సంతోషంగా గడుపు.

సూక్ష్మంగా: నీలో ఉన్న ఆత్మ ని గ్రహించినప్పుడు, అదే ఆత్మ నీ చుట్టుపక్కల సృష్టి లోనూ ఉన్నదని గుర్తించి, వారూ నీలాంటి వాళ్ళే అని గ్రహించి సుఖంగా జీవితం గడుపుతావు .

1. క్షణ క్షణమూ మారిపోతున్న ఈ జగంలో (ప్రపంచంలో) పాత సంగతులు గుర్తుపెట్టుకోవడం మూలాన వచ్చేది ఏమీ లేదు. బాధలు తప్ప. వాటిని మెరిచిపో.

2. పక్కవాడి సంపద కోసం పాకులాడబోకు. అది మనోవేదనకి తప్ప పనికిరాదు.

3. నీలో ఉన్న ఆత్మని ఏకాగ్రతతో ధ్యానించి దానితో మమేకమవ్వు.

4. అందరిలో ఉన్నది నేనే. నిదానించి చూస్తే నీ పక్కనున్న వారిలో నూ నీ ఆత్మ కనపడుతుంది. అందరితో శత్రుత్వం పోయి మిత్రత్వం పెంచుకుంటావు. నేనే కదా మీ అందరినీ సృష్టించినది.

ఈ నాలుగు సూత్రాలూ అర్ధం చేసుకుని పాటించగలిగితే మీరు సత్ చిత్ ఆనంద్ లు అయి సంతోషంగా జీవితం గడుపుతారు. ఈ ఉపనిషత్  లో మిగతా శ్లోకాలు మీకు అనవసరం. అవి పై సూత్రాలు  పాటించలేని వారికి.

Summary written in English for people who do not know how to read Telugu.

We think most of the problems we encounter in life relate to the imperfect nature of others. And we want them to change so that we can solve all our problems. This is difficult to do because there are many. Instead if we change ourselves it is easy to get along with others.


Here the Upanishad says you are part of a creation as everybody else around you. In every living being I am there as a creator. First you get a sense of me in you by meditating . Once you realize me in you, you can see me everywhere around you and start loving everybody as you recognize everybody as you (We all love ourselves first). As the world is moving forward all the time, whatever happened in the past, forget them and enjoy your life without aspiring for another person's wealth.

నా మాట:
దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి.

1. Swami Aparajitananda

2. The Upanishads

No comments:

Post a Comment