Wednesday, September 18, 2019

154 ఓ బుల్లి కథ -- ఆరోగ్యంగా ఉండాలంటే - Part 3

జీవత్వం ఉన్న ప్రతి వ్యక్తికీ గాలి,నీరు,ఆహారం చాలా ముఖ్యం. కాకపోతే ఎవరి ఇష్టాఇష్టాలకి అనుగుణంగా వాటిని మార్చుకుంటూ ఉంటాము. ఉదాహరణకి మనం బ్రతకటానికి కాఫీ త్రాగ వలసిన అవసరం లేదు, సారాయి త్రాగవలసిన అవసరం లేదు, సిగరెట్ పొగ పీల్చ వలసిన అవుసరం లేదు, పంచ భక్ష పరమాన్నాలతో భోజనము చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి దూరంగా ఉన్నవాళ్ళు కూడా మనతోపాటు జీవిస్తున్నారు కనుక.

ఏ గాలి పీల్చాలి , ఏ నీరు తాగాలి, ఏ ఆహారం తినాలి అనేవాటిని సామాన్యంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏమన్నా అవకతవకలు కనిపిస్తే వాటిని పైకెత్తి చూపటం, వాటిని సరిచేయించటం, వినకపోతే శిక్షించటం కూడా వాళ్ళ పనే. అమెరికాలో అయితే ఆ పదార్ధాలని వెంటనే అమ్మకాలలోనుండి తీసివేస్తారు, గాలి లో పోలెన్ ఎక్కువగా ఉంది జాగర్త అని సూచనలు ఇస్తారు, ఈ నీరు కలుషితం తాగొద్దని చెబుతారు.

ఎన్ని జాగర్తలు పాటించినా మనం కొన్ని సార్లు అస్వస్థతకు గురి అవుతాము. కలుషిత వాతావరణం లో పెరిగిన సూక్ష్మ జీవులు (దోమలు, ఈగలు మొదలైనవి) కుట్టి రక్తంలోకి  కల్మషాలు పంపటం మూలంగా, కలుషిత ఆహార పదార్ధాలు తినటం తాగటం వలన, కలుషిత మందులు వేసుకోవటం (మొన్ననే Zantac / Ranitidine గురుంచి వార్త),శరీర తత్వం  Lactose intolerant, allergy, virus వగైరా, కారణం ఏ వయినా కావచ్చు.డాక్టర్ దగ్గరకు వెళ్తాము మందులిస్తారు తగ్గితే మంచిది లేకపోతే ఆయన మనమీద అలా practice చేస్తూనే ఉంటారు.

మనం అనుకోకుండా మన తృప్తి కోసం, రుచి కోసం ఆగలేక ఇష్టపడి తిన్నవాటితో కూడా మనకి అనారోగ్యం కలగ వచ్చు. దీనికి కారణం "రుచి" అని మనము ఆనందించే ప్రక్రియ మన మనస్సుకి అందే రెండు సంకేతాల కలయిక,మన నాలిక మీద "taste buds " నుండి వచ్చే సంకేతాలు, మన ముక్కు నుండి వచ్చే వాసనల సంకేతాలు. శాస్త్రజ్ఞులు మనం ఆనందించే  పదార్ధపు "రుచి" అనే అనుభవం 85% దాని  "వాసన"  మీద ఆధార పడి ఉంటుందని కూడా తేల్చారు.

దీనిమూలాన  "flavorists " అనే వాళ్ళు పుట్టుకు వచ్చారు. వాళ్ళు చేసేపని పరిశోధన శాలలో కూర్చొని రసాయనాలు కలిపి మనకు ఇష్టమయిన వాసనలు తయారు చెయ్యటం. వాటిని తిండి పదార్ధాల మీద ప్రయోగించటం. ఉదాహరణకి పొటాటో చిప్స్ అన్ని flavors లో రావటానికి కారణం అదే (అమెరికాలో కనీసం మామూలు షాపుల్లో పది రకాల పొటాటో చిప్స్ ఉంటాయి). వచ్చిన గొడవేమిటంటే అన్ని flavors (chemicals ) మన దేహానికి సరిపోతయ్యని చెప్పలేము. తింటే అనారోగ్యానికి కారణం అవ్వచ్చు.

ఇప్పుడు ఎక్కడ చూసినా దేనిలో చూసినా additives ఉంటాయి. ప్రతీ దానిలోనూ ingredients ఏమున్నాయో చూసుకుంటూ ఉండాలి. తినటం ఆపలేము కాబట్టి, ఏపదార్ధాలు తింటున్నామో గమనించి అవి తిన్న తర్వాత అనారోగ్యమునకు దారితీస్తే వెంటనే వాటిని తినటం మానెయ్యాలి.  అందరి శరీర తత్వాలు ఒక విధంగానే ఉండవు  కాబట్టి, ఏవి తినాలో ఏవి తిన కూడదో, ఎవరికి వారు తయారు చేసుకోవలసిన ప్రణాళిక.

మనం ఎంత జాగత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అస్వస్థతకి గురి అవుతూ ఉంటాము. అస్వస్థతగా ఉన్నప్పుడు మన శరీరం ఆ అస్వస్థతకు కారణాన్ని గమనించి సరిచెయ్యటానికి ప్రయత్నిస్తుంది. అటువంటి పరిస్థుతులలో దాని పనికి(immunity) అడ్డు రాకుండా తేలికగా అరిగే (శరీరం కష్టపడకుండా అరిగే ) పదార్ధాలని తినాలి. దానినే మా చిన్నప్పుడు అమ్మలూ అమ్మమ్మలు "పథ్యం భోజనం" అనే వారు.

నాకయితే నాకు మా అమ్మలూ అమ్మమ్మలూ నేర్పిన పథ్యం భోజనం -- అన్నంలో, కారప్పొడి, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, చారు, మజ్జిగ. తినే పరిస్థితిని బట్టి వాటిలో ఏవి తినాలో నిర్ణయించకోటమే. మీరు కూడా మీ శరీరానికి అరుగుదలలో శ్రమ తగ్గించే "పథ్యం" భోజనం  నిర్ణయించుకోండి. ఇది చాలా ముఖ్య మయినది.

Reference:
1. Taste and Digestion (2018), Edited by Joanne Randolph, Enslow Publishing, New York, NY
   
Disclaimer: This article is not intended to provide medical advice, diagnosis or treatment. Consult your doctor for advice. 


No comments:

Post a Comment